- ప్రస్తుతం పార్లమెంటులో ఉన్నవారిలో 162 మంది ఏదో ఒక నేర చరిత్ర కలిగి ఉన్నవారు. ఆ ఉన్నత స్థానాన్ని శుభ్రపరచాల్సి ఉంది.
- మన రాజ్యాంగాన్ని మూడేళ్లలోనే రూపొందించారు. కానీ అవినీతిపరుల భరతం పట్టే లోక్పాల్ను రూపొందించడం 44 ఏళ్లైనా సాధ్యపడటం లేదు!
- ప్రస్తుతం భారతదేశం ‘హై కమాండ్’ అనే నియంతృత్వ వ్యవస్థ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. ప్రజలను దాని చెర నుంచి విముక్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు తమపై తామే విచారణ జరిపించుకొంటారా? వారి విషయంలో కూడా లోక్పాల్ ద్వారా ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడుతుంది. లేకపోతే లోక్పాల్ ఒక పోస్టాఫీసులా మిగిలిపోతుంది.
- మహాత్ముడి రక్తంతో తడిసిన మట్టిని కూడా వేలానికి పెట్టారు. ఎంతో పవిత్రమైనదాన్ని వేలానికి రాకుండా ఆపాల్సిన మన ప్రభుత్వం, కనీసం ఆ వేలంలో కొనే ప్రయత్నం కూడా చేయకపోవడం సిగ్గుచేటు!
- దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. దీన్ని ఎదుర్కొని నిలవడం దానికి అత్యంత కష్టమైన పని. ఇకనైనా ఆ పార్టీ... ప్రజల నమ్మకాలతో ఆడుకోవడం ఆపితే మంచిది.
-సేకరణ: జీవన్(సాక్షి పత్రిక)
Thursday, June 28, 2012
Aravind Kejriwal
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment