- బుద్ధిని ఆడించడానికి మనసు చేసే గారడీ.......ప్రేమ!
- తనకీ, ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్,బహిర్ యుద్ధారావమే కవిత్వం.
- గొప్ప కవిత్వం యొక్క ప్రధాన లక్షణమేమిటంటే ఎవరి తాహత్తును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతి కలిగించడం.
- సాధించవలసిన దానిని ఈ ప్రపంచంలో ఏదైనా సాధించారంటే తిరగబడ్డ వాళ్లే.
- ఇంతకీ ...లేని సౌదర్యాన్ని నేను చుస్తున్ననా ?? ఉన్న సౌందర్యానికి మీరు అందులయినారా ?
- అవును... జన్మ రాహిత్యం ఎప్పుడవుతుంది..?? పరమాత్మలో ఐక్యం అయినపుడు.. ఆ ఐక్యం కావడమే నిరంతర అవ్యయానందం ,, ఆ లోకం లో కూడా ఆనందం అంటే.. - ఐక్యం
- ఎందుకు ?" ఉన్నాడని ఎట్లా తెలుసు ? "లేడని ఎట్లా తెలుసు? మేట్లా ?ఉన్నదాన్ని తెలుసుకున్నవా ?దేన్నీ ?నిన్ను ..!తేలికేం.
- ఒక్కటే సాధనం.. సాహసం. " జీవితం లో విశ్వాసం. మూడత్వం మీద ...కర్మ మీద..శాసనం మీద తిరుగుబాటు.. భవిష్యత్తు మీద నిర్భయం.. ఆత్మలో దైర్యం...పర్యవసానాల మీద నిర్లక్షం "
- "ఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు. ఇప్పటికి కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ ఆశలేదు.
- స్త్రీలను గౌరవించమని ప్రతివాడు గోలపెడతాడు.. అగౌరవం అంటే కోరటం అని అర్థం.గౌరవం పొందటం అతి సులభం..ఓ నలబై ఏళ్ళు గడిచి మీ సౌదర్యం మాసిపోగానే అత్యంత గౌరవం పొందుతారు. ప్రతివాడు గౌరవిస్తాడు..ఒక్కడూ కోరడు.
- ఈ నాడు ఈ దేశం లో ఎలాగైనా ధనం సంపాదించే మార్గమే ధర్మ మార్గమైంది.
- డబ్బు పేరు సంపాదించిన స్త్రీలు తమ సంసారమెట్ల ఉన్నాసరే సంఘంలో యోగ్యులైనారు.
- తెల్లారి లేస్తే ఉరుకులు, పరుగులు, ఉద్యోగాలు డబ్బులు , ఇవ్వన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనో వ్యవధి, పువ్వులనుంచి, ఆవులనించి, అతితులనించి, ఇతలురాల్ ఆకలి తీర్చడం నుంచి వచ్చే సంతోషం ఉత్సాహం, శాంతి ఎప్పుడు కలుగుతుందో ఈ మానవులకి.
- "సౌఖ్య మివ్వడానికి ధనము ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలం ఇంకా ఏ విలువకీ స్ట్లముండదు మనుషుల మనస్సులో , తనను సృష్టించిన మన్ను తోటి, తన కళ్ళు తెరిచిన కాంతి తోనూ సంబంధానికి దూరమవుతున్నాడు మనిషి."
- "మనసు మారకుండా ఆత్మ అభివృద్ధి చెందకుండా ప్రపంచం అంటే అర్థం కాకుండానే ఏవో కొన్ని కర్మల వల్లా.. పూజల వల్లా యోగాల వల్ల దేవుడి దయ సంపాదించ వచ్చుననే నమ్మకం ఈ మనుషులకి.. ప్రపంచంలో ఈ గొప్ప విషయము అర్థం కాని ముర్ఖుడికి ఈశ్వర జ్ఞానం కల్గుతుందట.. ఈ దేశం చాల ఉన్నతమైన దని ఏ లోపాలు లేవని , ఈ ఆచారాలన్నీ చాల వివేకంతో స్థాపించినవనీ, అంతరార్థలున్నాయని కీర్తిస్తే .. మయజోల పాడి జో కొడితే చాల సంతోషం ఈ ప్రజలకి. ఇంకా ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకటానికి మార్గాలున్నయనీ చెపితే విరోధం సహజమే."
- జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.
- సంస్కారమంటే ...ఈనాడు డబ్బు సంస్కారం తప్ప ఇంకోటి లేదు , తనకో ఆత్మ ఉందని మరిచి పోయినాడు మానవుడు. struggle for existance. ప్రకృతిలో- చెట్లలో- కీటకాలలో ఎట్లా ఉంది అంటారో అదే మనుషుల్లో ఈనాడు. వాటికి శాంతి ఉంది అది లేదు మానవుడికి..
- మతమంటే మనసుకి కలిగే గొప్ప సందేహాలు తీర్చాలి , మన జీవనానికి నమ్మకానికి సమన్వయము కుదిరించాలి.లోకంలో కొత్త సమస్యలు బయలు దేరితే వాటిని అర్థం చెయ్యాలి. నుతనోస్థం ఇవ్వాలి జీవించడానికి. అంతే కాని ఏదో నేను చెపుతున్నాను , నమ్ము. నమ్మితే మోక్షం ,, నమ్మక పోతే నరకం.. నా పాణి పరలోకం ఈ లోకం తో పని లేదు అనే మతం ఎందుకు పనికి రాని మతం..
- ఇన్ని ఆచారాలతో ఈశ్వర నామాలతో ప్రతిమూలా మరుగుతో ఉండే ఈ దేశం లో ఈ పూజలు , మల్లు ముక్కులు ముసుకోదాలు , వేదాంతాలు మాట్లాడే వాళ్ళు. రుద్రస్కల వాలు.. విభూతుల వాళ్ళు..వీళ్ళని ప్రశ్నిస్తే ,, ఏదో శాస్త్రం .. అవతారం..కరం అని గొణగడం తప్పిస్తే ఈ సందేహాలు తీర్చరేం ..?? ఎందుకు ఈ ఆద్యాత్మికం ,, ఈ భజనలు భాష్యాలు భగవత్గీతలు అంత గోపా పుస్తకాలేమో వేళ్ళకి ఎవరికీ తెలిసినట్టు కనపడదు. మతానికి జీవితానికి ఈ సంబందం లేదు . దెయ్యాలు ఆత్మలు పరలోకం ఈశ్వరుడు కరం పాపం. పుణ్యం. ఇట్లాంటి విషయమై ఒక్కరికి నిష్టితాభిప్రాయం లేదు.
Tuesday, October 04, 2011
Gudipati Venkatachalam
Subscribe to:
Post Comments (Atom)
chala bhaghavundhi andi
ReplyDelete