Tuesday, September 13, 2011

George Gurdjieff


  1. మేల్కొన్న  మనిషి దేనినైనా సాధించగలడు. మేల్కోకుండా నిద్రపోవడం మృత్యుసమానం.
  2. నిజాయితీ  మాటమాత్రంగా కాక,నిజంగా ఉండాలి.అది తనను తాను చీల్చుకొని చర్మాన్ని ఒలుచుకొని చూసుకోవడం లాంటిది.
  3. అధికులం,సర్వజ్ఞులం,ఉన్నతులం అనుకునే వాళ్ళంతా ఆ వంచనలో దాగిన బోలుతనాన్ని గుర్తించకుండానే బతుకుతున్నారు.
  4. నిరంతరం వరదలా వచ్చిపడే అసత్యపు విలువలు మరింత  దుఃఖాన్ని తెచ్చిపెడతాయి.
  5. జీవితానికి ఏకాంతం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఒంటరిగా జీవించకూడదు.  
  6.  వాగుడు అలవాటైతే అది నీ శక్తిని నాశనం చేస్తుంది. నీ లక్ష్యాన్ని చేరనీయకుండా అడ్డుపడుతుంది.వాగడం మానేస్తే ఏం చేయాలో  నీకే తెలుస్తుంది.
  7. నువ్వు దేనినైతే 'నేను' అనుకుంటున్నావో ముందు దాని సంగతి పూర్తిగా తెలుసుకో.
  8. అది నువ్వు అనుకునే 'నేను' కాదు, నీలో ఇంకా చాలా 'నేను' లున్నాయి.
  9. మనిషి సహజంగా తన బలహీనతల్ని ఎప్పుడూ ఒప్పుకోడు.వాటిని చూడడు,పట్టించుకోడు,తెలిసినా,తెలిపినా సరిదిద్దుకోడు.
  10. మనిషి తన నుంచి తాను విడికానంత కాలం, అతడు దేన్నీ చూడలేడు. 
  11. తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి.
  12. జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సింది స్వేఛ్ఛ.బాహ్యా విషయ ప్రభావాల నుండి బయటపడి, ఆంతరంగిక స్వభావాల నుంచి విముక్తి పొందనిదే స్వేఛ్ఛ లేదు.
  13. ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి ఏదో విధంగా బంధీయే. దాన్నుంచి తప్పించుకునే అవకాశం కోసం తపించడమే సాధన.
  14. మనలో అహంకారం వంటి ఎన్నో స్వతంత్ర శక్తులున్నాయి. అది సైతానికి ప్రతినిధి,మనిషికి ప్రధాన శత్రువు. 
  15. మార్గం మార్చకు,లక్ష్యం మరువకు, ఎరుకతో ముందుకు సాగు, యాత్ర ప్రారంభించాక అన్వేషిగా మిగిలిపో. 
  16. సాధారణంగా చాలా మందిలో శ్రద్ద అనేది ప్రత్యేకంగా ఉండదు. శ్రద్ద ఉన్ననాడే సత్య సందర్శనం సాధ్యం.
  17. రోజూ ఓ గంట సేపు నిశ్చలంగా కుర్చో, ఆ కాసేపు మనోమౌనంగా ఉండు. ఆ తర్వాత  ఒక తెల్ల కాగితం తీసుకొని  నీ లక్ష్యమేమిటో దానిపై రాయి. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం, ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని పదే పదే తెరచి చూడు. అది నీకు శక్తిని, సామర్ధ్యాన్ని ఇస్తుంది.
  18. మనిషి పుట్టినప్పుడు మిల్లులోంచి బైటికి వచ్చిన తెల్ల కాగితం మాదిరిగానే ఏ మచ్చా మరకా లేకుండా శుభ్రంగా ఉంటాడు. పెరిగే కొద్దీ పరిసరాల,పరిస్థితుల ప్రభావం అతనిపై పనిచేస్తాయి. విషయ జ్ఞానం, లోకజ్ఞానం పేరుతో నీతి,దైవం,ధర్మం,జ్ఞానం,మర్యాద,బాధ్యతల పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,మతం,గురువులు కలిసి ఆ కాగితాన్ని చేయగలిగినంత మురికి చేస్తారు. కాగితమెంత ఎక్కువ మురికిగా ఉంటే అంత గొప్పగా చెలామణవుతుంది.

No comments:

Post a Comment