- ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
- అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని చేయడమే నా లక్ష్యం.
- నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
- రాష్ట్ర ప్రజలకు జీవితాంతం సేవ చేయడమే భాగ్యం.
- ఆర్ధిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్ర్యానికి అర్ధం లేదు
- ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగు పడాలి. అందుకు అధికారులు నిబద్ధత,పారదర్శకత,కార్యదీక్షతో పనిచేయాలి.
- ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా మారుమూల పల్లెలకు వెళ్ళాలి.
- ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
- పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది, ఈ తృప్తి చాలు.
- బీడు తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి.
- రిలయన్స్ గ్యాస్ అందుబాటులోకి వస్తే మూడో పంటకు కూడా విద్యుత్ సరఫరా చేస్తాం. అప్పుడిక ప్రతి రైతు ఇంట సంక్రాంతే.
- మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
- నా అక్కలూ,చెల్లెళ్ళు..తముళ్ళ కళ్ళలో వెలుగులు చూసినపుడే నా నిజమైన పుట్టినరోజు.
- ప్రతిరైతు పట్టణ ప్రాంత వ్యక్తితో సమానంగా ఆదాయం పొందాలన్నదే నా అభిమతం.
- ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు.
- పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్య రంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
- అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
- జల ప్రాజక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకూండా పనిచేయాలి.
- గ్రామాల్లో సంపద పెరగాలి పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి.
- ప్రజల ఋణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి.
- జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు.
- ప్రాజక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలి.
- పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి.
- గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు.
- ఎన్ని కరువులనైనా ఎదుర్కోగలగాలి, దీని కోసం ఆర్ధికంగా ఎదగాలి.
- ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.
- స్వఛ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు,చెంచు,ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు.
- ప్రజల ఋణం తీర్చుకొనేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం.
- ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి.
- నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
- అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమము అంతే ముఖ్యం.
Tuesday, May 17, 2016
YS Rajasekhara Reddy
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment